Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

సెల్వి
బుధవారం, 21 మే 2025 (19:13 IST)
Naresh_Pavitra lokesh
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో భావోద్వేగభరితమైన  అనుభవాన్ని చవిచూశారు. వారికి అంతకు ముందు తెలియని ఒక మహిళ ఆ జంట వద్దకు వచ్చి, వారి బంధాన్ని ప్రశంసించి, వారికి స్వీట్లు అందించి, వెళ్లిపోయింది. ఈ పరిచయం వారిని ఎంతగానో కదిలించింది. నరేష్ ఈ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "ఆమె ఎవరో మాకు తెలియదు, కానీ ఆమె మాటలు నా హృదయాన్ని వెలిగించాయి" అని అన్నారు.
 
నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, తాను, పవిత్రా లోకేష్ హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్నప్పుడు, ఒక మహిళ వారి వద్దకు వచ్చి మాట్లాడటం ప్రారంభించింది. నరేష్‌-పవిత్ర సంబంధాన్ని కొనియాడింది. నరేష్ ఆ స్త్రీని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, ఆమె ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. ఇదో అద్భుతమైన అనుభూతి అంటూ నరేష్ పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. తాజా ఇంటర్వ్యూలో పవిత్ర తన మొదటి క్రష్ గురించి చెప్పింది. అక్కినేని నాగార్జున అంటే తనకు ఆరో తరగతి నుంచే ఇష్టమని తెలిపింది. తన జీవితంలో అలాంటి వ్యక్తి వుంటే బాగుంటుందని అనిపించేదని వెల్లడించింది. నాగార్జున తర్వాత ప్రకాష్ రాజ్‌ని చూశాక కూడా అలానే అనిపించిందని పవిత్ర వెల్లడించింది. ప్రస్తుతం పవిత్ర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments