Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావమరిది పాడె మోసిన నారా చంద్రబాబు.. ప్రచార రథంతో యాత్ర

నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (14:55 IST)
నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు. గురువారం 2 గంటల సమయంలో మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు.
 
ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడెను మోశారు. పాడెకు ముందు ఎన్టీఆర్ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు విషణ్ణవదనంతో ముందునడిచారు. ఈ అంతిమ యాత్రకు నందమూరి అభిమానులేకాకుండా స్థానికులు కూడా భారీ ఎత్తున తరలివచ్చి.. హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments