Webdunia - Bharat's app for daily news and videos

Install App

''క్రాక్''తో మళ్లీ ఫామ్‌లోకి శృతి హాసన్... నాగ్ అశ్విన్ వెబ్ సిరీస్‌లో అదరగొడుతుందట!

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (21:30 IST)
shruti haasan
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమాలో నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తోన్న క్రాక్‌లో ఈ భామ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది.  
 
రవితేజ 'డిస్కో రాజా'తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి. అయితే రవితేజతో మరోసినిమాలో కూడా శృతి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఈ సినిమా తర్వాత ఖిలాడీ అనే సినిమా చేయనున్నాడు. దీని తర్వాత ఓ ఎంటర్ టైనర్‌ను నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో చేస్తున్నాడు. 
 
ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరోసారి రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుందట.
 
ఇక శృతిహాసన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఇటు సినిమాలు చేస్తూనే.. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంతో సైలెంట్ గా ఓ క్లాస్ హిట్ ను అందుకున్నా నాగ్ అశ్విన్.. ఆ సినిమా హిట్ తరువాత 'మహానటి' చిత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్నాడు. 
 
నాగ్ అశ్విన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని అనౌన్స్ చేసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా.. హాట్ టాపిక్ గా మారాడు. అయితే ప్రభాస్ ప్రస్తుత సినిమాల వల్ల కొంత గ్యాప్ దొరకడంతో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడట నాగ్ అశ్విన్. 
 
ఈ వెబ్ సిరీస్‌ దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉంటుందట. శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ వెబ్ ఫిల్మ్ హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్‌కు తెలుగు రీమేక్ అని సమాచారం. దీనితో పాటు రానాతో కలిసి ఓ క్రేజీ వెబ్ సిరీస్‌లో శృతి హాసన్ నటించనుంది. ఈ వెబ్‌సిరీస్ కోసం ప్రముఖ తెలుగు దర్శకుడు కథను అదించారని, నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం అందుతోంది. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments