Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' ట్రైలర్‌ మీ కోసం..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' ట్రైలర్‌ వచ్చేసింది. బన్నీ, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం నాడు ట్విట్టర్ ద్వ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (13:34 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' ట్రైలర్‌ వచ్చేసింది. బన్నీ, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం నాడు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు బన్నీ. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ చిత్రం మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది.  ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్‌ను గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం అనే గ్రామంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ''నాకు ఇండియా కావాలి ఇచ్చెయ్'' అంటూ అల్లు అర్జున్ డైలాగ్‌తో ట్రైలర్ అవుట్ అయ్యింది. 
 
జైలుగదిలో తీవ్రవాదితో ఇదే నీ ఆఖరి బిర్యానీ. బిర్యానీ తినేంతలోపు నిన్ను చంపేస్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, నాకు కోపం వచ్చినప్పడు బూతులే వస్తాయి.. మంత్రాలు రావు. క్యారెక్టర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడమే. చావు రాకముందు చచ్చిపోవడమే అని టీజర్‌లో బన్నీ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. 
 
ఇక ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే, ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు రంగస్థలం చిట్టిబాబు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments