Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడికాయ పచ్చడి తినీ.... మణిరత్నం ఆరోగ్యంపై క్లారిటీ

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (11:52 IST)
లెజండ్రీ దర్శకుడు మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనీ, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ సోమవారం అనేక ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు... వెబ్, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. నిజానికి ఆయన రెగ్యులర్ చెకప్స్ కోసం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో మణిరత్నంకు మరోమారు గుండెపోటు వచ్చిందంటూ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశారు. 
 
ఈ వార్తలపై మణిరత్నం సతీమణి, సినీ నటి సుహాసిని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "నా భ‌ర్త త‌దుపరి సినిమా కోసం ఉద‌యం 9:30 గంటలకే ఆఫీస్‌కు వెళ్లారు. నేను తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్‌లో ఇంట్లో బిజీగా ఉన్నాను. నా భర్త ఉదయం చేసిన రోటి, మామిడికాయ పచ్చడి ఇష్టంగా తిని తదుపరి మూవీ స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీస్‌కు వెళ్ళారు" అని సుహాసిని పేర్కొంది. 
 
దీంతో మ‌ణిర‌త్నం ఆరోగ్యానికి సంబంధించి వ‌స్తున్న పుకార్ల‌కి బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం మ‌ణిరత్నం "పొన్నియన్ సెల్వం" చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా ఇందులో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం సొంత నగ్న వీడియోల స్ట్రీమింగ్ చేస్తున్న జంట.. ఎక్కడ?

విమానం ఇంజిన్‌లో మంటలు... టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే...

మాట మార్చిన డోనాల్డ్ ట్రంప్ - ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం!!

Divvela Madhuri: ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక.. లంగా వోణిలో దివ్వెల మాధురి.. వీడియో వైరల్

అలకనంద నదిలో పడిన మినీ బస్సు - ఒకరి మృతి - పలువురు గల్లంతు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments