Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా నుదిటి మీద ఏమి రాసివుందో నాకేమి తెలుసు? సోను సూద్

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:24 IST)
కరోనా కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపద్బాంధవుడుగా కనిపించిన నిజమైన హీరో సోను సూద్. కరోనా కాలంలో చితికిపోయిన బతుకులకు ఆసరా అందిస్తూ వస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సాయం కేవలం స్వదేశంలోనే కాదు.. విదేశాల్లో వున్నవారికి కూడా ఆయన సాయం చేశారు. 
 
అయితే, ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇలా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలేచనేదీ లేదని అన్నారు. 'ఒక యాక్టర్‌గా నా చేతిలో చాలా పనులున్నాయి. దీనికితోడు నేను ఎన్నో చారిటీ పనులు చేస్తున్నాను. వీటిపైనే దృష్టి పెట్టేందుకు సమయం సరిపోతోంది. అందుకే ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించేందుకు చోటులేదు. 
 
పైగా రాజకీయాల గురించి నాకు ఏమాత్రం తెలియదు. అయితే పదేళ్ల తరువాత నేను ఏం చేస్తానో, నా నుదిటి మీద ఏమి రాసి ఉందో నాకేమి తెలుసు? నేను చాలా ముందుకు వెళ్లాల్సివుంది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏ పార్టీవారినో అడిగి చేయడం లేదు. నా ఇష్టాపూర్వకంగానే చేస్తున్నానని' అంటూ సోనుసూద్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments