Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తొలి పాట ఇక్కడే పుట్టింది : చంద్రబోస్‌

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (15:33 IST)
Chandra Bose, sureshbabu
ఆస్కార్‌ అవార్డు నాటునాటు పాటకు పొందిన తర్వాత తొలిసారి గీత రచయిత చంద్రబోస్‌ రామానాయుడు స్టూడియోకు వెళ్ళారు. శుక్రవారంనాడు రికార్డింగ్‌ సందర్భంగా వెళ్ళిన ఆయన రాక తెలిసిన డి. సురేష్‌బాబు సాదరంగా ఆహ్వానించి చిరుసత్కారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
 
Chandra Bose, sureshbabu
1995లో డా. డి. రామానాయుడుగారిని ఇదే రూమ్‌లో కలిశాను. అప్పట్లో ఇది గ్లాస్‌ రూమ్‌. తాజ్‌ మహల్‌ సినిమాకు పాటలను రాసి ఇక్కడే వినిపించాను. సంగీత దర్శకురాలు శ్రీలేఖ కూడా వున్నారు. మొదటి మొదటిసారి నేను పాటను విన్నవెంటనే ఆయన చక్కని తెలుగు పదాలు ఉట్టిపడ్డాయి అని కితాబు ఇచ్చారు. శ్రీలేఖగారికి కూడా బాగా నచ్చింది. సినిమా విడుదల తర్వాత ఆ పాటకు ఎంతో పేరు వచ్చింది. అలా నాయుడుగారితో నా జర్నీ మొదలైంది. అది ఆస్కార్‌ స్థాయికి వెళ్ళేలా చేసింది. పై నున్న నాయుడుగారి ఆశీర్వాదం కూడా వుంది. ఆయన వారసుడిగా డి.సురేష్‌బాబుగారు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా శాయశక్తులా వారి సినిమాలకు మంచి పాటలు రాస్తానని తెలిపారు. ఈ సందర్భంగా డి.సురేష్‌బాబు చంద్రబోస్‌ను భుజం తట్టి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments