Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్ద‌రితో నా కెమిస్ట్రీ బాగుంటుంది- పూజా హెగ్డే

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (17:08 IST)
Pooja Hegde
ప్ర‌భాస్‌తో పూజా హెగ్డే చేసిన సినిమా `రాధేశ్యామ్‌`. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌భాస్‌తో విభేదాలున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత వాటిని కొట్టిపారేసింది. ఇటీవ‌లే బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న `స‌ర్క‌స్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది. ప్ర‌భాస్‌తో త‌న‌కూ ఎటువంటి విభేదాలు లేవు. ప్ర‌భాస్ మంచి వ్య‌క్తి. రాధేశ్యామ్‌లో ప్ర‌భాస్‌తో కెమిస్ట్రీ బాగుంది. చూసిన‌వారంతా అదే అన్నారు. ఆ సినిమా నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మ‌ళ్ళీ  ఛాన్స్ వ‌స్తే బాహుబ‌లి3లో చేయాల‌నుంది. అందులో నాయిక‌గా నేనే చేస్తా. రాధేశ్యామ్‌లో నేను క‌ళ్ళ‌తో ప‌లికిన స‌న్నివేశాల‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి అని చెప్పింది.
 
అలాగే స‌ర్క‌స్ సినిమా గురించి చెబుతూ, ఇది పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా. ర‌ణ్‌వీర్ సింగ్ హీరో. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ హైలైట్ అవుతుంది. నేను ర‌ణ‌వీర్‌ను ఆంటీ అని పిలుస్తాను. ప‌మ్మీ ఆంటీ అని పేరు పెట్టాను. ఎందుకంటే సెట్లో ఎప్పుడూ స‌ర‌దాగా వుంటాడు అని చెప్పింది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ విదేశాల్లో జ‌రుగుతోంది. సో. ఇద్ద‌రు హీరోల‌తో కెమిస్ట్రీ బాగుంద‌ని చెప్పిన హారోయిన్ పూజా హెగ్డే అన్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments