Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్ద‌రితో నా కెమిస్ట్రీ బాగుంటుంది- పూజా హెగ్డే

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (17:08 IST)
Pooja Hegde
ప్ర‌భాస్‌తో పూజా హెగ్డే చేసిన సినిమా `రాధేశ్యామ్‌`. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌భాస్‌తో విభేదాలున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత వాటిని కొట్టిపారేసింది. ఇటీవ‌లే బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న `స‌ర్క‌స్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది. ప్ర‌భాస్‌తో త‌న‌కూ ఎటువంటి విభేదాలు లేవు. ప్ర‌భాస్ మంచి వ్య‌క్తి. రాధేశ్యామ్‌లో ప్ర‌భాస్‌తో కెమిస్ట్రీ బాగుంది. చూసిన‌వారంతా అదే అన్నారు. ఆ సినిమా నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మ‌ళ్ళీ  ఛాన్స్ వ‌స్తే బాహుబ‌లి3లో చేయాల‌నుంది. అందులో నాయిక‌గా నేనే చేస్తా. రాధేశ్యామ్‌లో నేను క‌ళ్ళ‌తో ప‌లికిన స‌న్నివేశాల‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి అని చెప్పింది.
 
అలాగే స‌ర్క‌స్ సినిమా గురించి చెబుతూ, ఇది పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా. ర‌ణ్‌వీర్ సింగ్ హీరో. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ హైలైట్ అవుతుంది. నేను ర‌ణ‌వీర్‌ను ఆంటీ అని పిలుస్తాను. ప‌మ్మీ ఆంటీ అని పేరు పెట్టాను. ఎందుకంటే సెట్లో ఎప్పుడూ స‌ర‌దాగా వుంటాడు అని చెప్పింది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ విదేశాల్లో జ‌రుగుతోంది. సో. ఇద్ద‌రు హీరోల‌తో కెమిస్ట్రీ బాగుంద‌ని చెప్పిన హారోయిన్ పూజా హెగ్డే అన్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments