Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టిపుల్ సెలిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నా : ఎంఎం కీరవాణి

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:30 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి తన ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. తాను మల్టిపుల్‌ సెలిరోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. 
 
ఈ మేరకు సంగీత దర్శకుడు ఎం.‌ఎం‌. కీరవాణి ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్నానని వివరిస్తూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వ్యాధి ఏ వయసువారికైనా, ఎప్పుడైనా రావచ్చని ఆయన తెలిపారు. ఇది మెదడు, శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుందని ఆయన చెప్పారు.
 
దీనిపై ఎంఎస్‌ ఇండియా సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని కీరవాణి తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారంతా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని ఆయన కోరారు. 
 
ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం‌ వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చన్నారు. ఈ వ్యాధి గురించి సినీనటి విద్యా బాలన్ మాట్లాడిన వీడియోను కూడా కీరవాణి ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments