Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిరివెన్నెల' సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించింది : ఇళయరాజా

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (13:02 IST)
తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంపై సంగీత మేథావి ఇళయరాజా స్పందించారు. సిరివెన్నెల మృతిపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతికలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఇంత త్వరగా శివైఖ్యం చెందడం చాలా బాధగా ఉందన్నారు. సిరివెన్నెల జీవించినంత కాలం పాట కోసం జీవించారని, బతికినంత కాలం పాటలే రాశారని, ఆయనకు ఈశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
వేటూరి సుందరరామమూర్తి అసిస్టెంట్‌గా చేరిన సిరివెన్నెల అనతి కాలంలోనే శిఖర స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. తమ ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు జీవం పోసుకున్నాయన్నారు. సిరివెన్నెల పాటల పదముద్రలు తన హార్మొనియం మెట్లపై నాట్యం చేశాయని అన్నారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతతో అర్థవంతమైన పాటలు అందించారన్నారు. 
 
ముఖ్యంగా, సిరివెన్నెల సాహిత్యం తనతో ఆనంద తాండవం చేయించిందని ఇళయరాజా అన్నారు. వేటూరు తనకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే సీతారామశాస్త్రి తనకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచారని ఇళయరాజా కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments