Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై డ్రగ్స్ కేసు : చిక్కుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (14:12 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇపుడు మరో మలుపు తిరిగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
బాలీవుడ్ బాద్ షా షారూక్ నివాసంపై కొద్ది సేపటి క్రితం ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. బాంద్రాలో ఉన్న షారూక్ నివాసం మన్నత్‌కు ఎన్‌సీబీ అధికారలు వచ్చి గాలింపులు చేపడుతున్నారు. అలాగే బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే ఇంటికి కూడా ఎన్‌సీబీ టీమ్ చేరుకుంది. 
 
సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. ఆర్యన్‌కు మంచి స్నేహితురాలు. ఆర్యన్ ఫోన్ చాటింగ్‌లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన చాటింగ్ సంభాషణలను కూడా కోర్టుకు ఎన్సీబీ అధికారులు ఓ నివేదిక రూపంలో సమర్పించారు. 
 
ఈ నేపథ్యంలో ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న ఆమె ఇంటిపై కూడా ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యను ఆదేశించారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న కొడుకును షారూక్ కలిసిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం విశేషం. కాగా, అనన్య పాండే హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫైటర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments