Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లను ఖరారు - కనీస టిక్కె ధర రూ.40?

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (08:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిన సినిమా టిక్కెట్ల వివాదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫుల్‌స్టాఫ్ పెట్టేలా ఉంది. అటు చిత్రపరిశ్రమకు, ఇటు ప్రేక్షకులను సంతోష పెట్టేలా నిర్ణయం తీసుకునే దిశగా అడుగుుల వేస్తుంది. ఇందులోభాగంగా, సినిమా టిక్కెట్ల ధరలను మూడు శ్లాబులుగా నిర్ణయించి, కనీస టిక్కెట్ ధర రూ.40గా ఖరారు చేసినట్టు సమాచారం. అయితే, దీనిపై మార్చి మొదటివారంలో అధికారిక ప్రకటనను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లను ఏసీ, నానా ఏసీ, మల్టీప్లెక్స్‌లుగా విభజించి, మూడు శ్లాబుల్లో టిక్కెట్ ధరల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీస ధర రూ.40గా, పట్టణ ప్రాంతాల్లో రూ.70గా ఉండేలా చూడాలని సూచించినట్టు చెప్పారు. ప్రభుత్వం దీనికి కాస్త అటుఇటుగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
అయితే, సినిమా బడ్జెట్ రూ.వంద కోట్లు దాటినపుడు మాత్రం టిక్కెట్ ధరలు ఎలా ఉండాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే, ఐదో ఆటపై కూడా ప్రభుత్వం చర్చించింది. చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సినిమా హాళ్ళలో టిక్కెట్ ధర కంటే తినుబండరాల ధరలే ఎక్కువగా ఉన్న అంశంపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments