Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాను కలిసిన బండ్లగణేష్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనలేదే..!

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (21:37 IST)
Roja_Bandla ganesh
సీనియర్ నటి రోజా, నటుడు, నిర్మాత బండ్లగణేష్ ఓ ప్రైవేట్ ఫంక్షన్‌‌లో కలిశారట. ఈ మేరకు ఫోజిచ్చిన ఓ ఫోటోను బండ్లగణేష్ నెట్టింట పోస్టు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు.. బండ్ల గణేష్‌కు కొంత కాలం క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్‌లో గొడవ జరిగింది. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన రోజాపై.. బండ్ల గణేష్ బూతులతో విరుచుకుపడ్డారు. రోజా కూడా తన నోటికి పనిచెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరికీ మాటలు లేవు. మాటాడుకోవడాలు లేవ్ అన్నట్టుగా అయిపోయింది.
 
అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఫంక్షన్‌కు వీరిద్దరు హాజరైయ్యారట. దాంతో వీరిద్దరూ పాత పగలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. 'చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని.. ఆమెకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేయడం విశేషంగా మారింది. ఈ ఫోటోను చూసినవారంతా సినీ ఇండస్ట్రీ అయినా..రాజకీయాలలోనైనా శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉండనే ఉందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments