Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (13:01 IST)
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరుగనుంది. ఇందుకోసం ఆయన ఈ నెల ఆరో తేదీన తాడేపల్లికిరానున్నారు. ఈ విషయాన్ని ఎస్‌వీఆర్‌ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము తెలిపారు. 
 
గురువారం స్థానిక కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో రాము మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. 
 
మౌలిక వసతులు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చిరంజీవి అభిమానులు సహకారం అందించాలన్నారు. సుమారు 40 వేల మంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్‌ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 
 
6వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి హైదారాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వస్తారన్నారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఐ.నాగు, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్‌, బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, టీడీపీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, కాపుసంఘం నాయకులు వడ్డీ రఘురాం, మాకా శ్రీనివాసరావు, అడపాల నారాయణ, మారిశెట్టి ఆజయ్‌, ఎస్వీఆర్‌ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments