Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన మెగాస్టార్ - మెగా పవర్ స్టార్

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (07:32 IST)
కేంద్ర మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలుసుకున్నారు. ఆస్కార్ వేదికపై అవార్డును అందుకున్న తర్వాత రామ్ చరణ్ శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించడంతో శుక్రవారం రాత్రి ఆయన్ను కలుసుకున్నారు. తొలుత చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ అమిత్ షాకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. ఆ తర్వాత రామ్ చరణ్‌కు అమిత్ షా శాలుపా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. 
 
దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా ఓ ట్వీట్ చేస్తూ, భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగ చిత్రపరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని చెప్పారు. "ఆర్ఆర్ఆర్" అద్భుత విజయం. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు చరణ్‌కు అభినందనలు అనిఅన్నారు. కాగా, శనివారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీ వేదికగా ఇండియా టుడే ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుగనుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటూ వచ్చిన తండ్రి.. నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన తండ్రి.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments