Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (20:35 IST)
భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగంలో చిరు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందుకున్నారు. ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ కలిగి ఉన్న దేశంలోని అతిపెద్ద నటులలో చిరంజీవి గారు ఒకరు.
 
మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు 2006లో దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ను అందుకున్నారు. 18 ఏళ్ల తర్వాత ఆయనకు పద్మ విభూషణ్ లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments