Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇంద్ర' చిత్ర బృందానికి మెగాస్టార్ చిరు సత్కారం

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (18:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఇంద్ర". బి.గోపాల్ దర్శకత్వంలో బడా నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై 22 యేళ్లు గడిచిపోయింది. దీన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని 4కేలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదల చేసినపుడు ఏ విధంగా అయితే, సునామీ క్రియేట్ చేసిందో అదేవిధంగా రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబడుతుంది. 
 
ఈ రిలీజ్‌ను పురస్కరించుకుని ఆ చిత్ర బృందానికి చిరంజీవి చిరు సత్కారం చేశారు. చిత్ర దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు అశ్వినీదత్‌, కె.ఎస్.రామారావు, కథా రచయిత చిన్నికృష్ణ, మాటల రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వర రావు, సంగీత దర్శకుడు మణిశర్మలను ఆయన తన నివాసానికి ఆహ్వానించి వారికి శాలువాలు కల్పి, పుష్కగుచ్చాలు ఇచ్చి అభినందించారు. 
 
ఈ సందర్భంగా వారి మధ్య ఆత్మీయ సంభాషణ జరిగింది. ముఖ్యంగా, సినిమా మేకింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ ఆత్మీయ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగినట్టు మెగాస్టార్ చిరంజీవిన తన ఎక్స్ ఖాతాలో వారితో దిగిన ఫోటోతో పాటు ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments