Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కరోనా పాజిటివ్ వచ్చింది... : నాగబాబు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (12:27 IST)
తనకు కరోనా వైరస్ సోకినట్టు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. నిజానికి నాగబాబుకు కరోనా వైరస్ సోకినట్టు గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, మెగా కాంపౌడ్ ఎక్కడ కూడా పొర బయటకు రానివ్వలేదు. ఈ నేపథ్యంలో నాగబాబే స్వయంగా బుధవారం ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ తేలింది. తొంద‌ర‌గా క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, నాగ‌బాబు గ‌త కొన్నిరోజులుగా ఓ ఛాన‌ల్‌లో వ‌చ్చే కామెడీ షో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అక్కడ నుంచే ఆయనకు ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నాగ‌బాబు సూచించారు. నాగ‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని అభిమానులు రీట్వీట్లు పెడుతున్నారు.
 
మరోవైపు, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడికోలుకుంటున్నారు. ఇలాంటి వారిలో నిర్మాత బండ్ల గణేష్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, దర్శకుడ తేజ తదితరులు ఉన్నారు. అయితే, లెజెండరీ గాయకుడు ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ఈ వైరస్ బారినపడి మృత్యుకోరల నుంచి బయటపడ్డారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments