Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్‌ను ఐపీఎస్‌గా.. నిహారికను డాక్టర్‌గా చూడాలనుకున్నా... ప్చ్.. నాగబాబు

Webdunia
బుధవారం, 13 మే 2020 (13:49 IST)
మెగా బ్రదర్ నాగబాబు. మెగా మర్రిచెట్టు నీడలో పెరిగినప్పటికీ.. ఇసుమంతైనా గర్వం లేదు. హీరోగా నిలదొక్కుకోలేకపోయినా నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. పైగా, తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, సుత్తిలేకుండా చెప్పేస్తాడు. ఇందులో ఎలాంటి మొహమ్మాటాలకు తావులేదు. తాజాగా ఆయన తన ఇద్దరు పిల్లల భవిష్యత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
తన కుమారుడు, యువ హీరో వరుణ్ తేజ్‌ను ఓ ఐపీఎస్ అధికారిగానూ, తన ముద్దుల కుమార్తె నిహారికను వైద్యురాలిగా చూడాలని భావించాను. కానీ, అది జరగలేదని చెప్పుకొచ్చారు. పైగా, తన ఇష్టాన్ని వాళ్లపై బలవంతంగా రుద్ద దలచుకోలేదు. వాళ్లకి ఇష్టమైన మార్గంలో వెళ్లడానికి నా వంతు సహకారాన్ని అందించినట్టు చెప్పారు. 
 
ఇకపోతే వారి పెళ్లిళ్ళపై నాగబాబు స్పందిస్తూ, నిహారికకు సంబంధాలు చూస్తున్నాం. వచ్చే యేడాది ప్రథమార్థంలో ఆమె పెళ్లిని జరిపించే అవకాశాలు ఎక్కువ. ఆ వెంటనే వరుణ్ తేజ్‌కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచన వుంది. వచ్చే ఏడాది చివరిలోగానీ .. 2022 ప్రథమార్థంలోగాని వరుణ్ పెళ్లి జరిపించే ఆలోచన వుంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాము. పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం నాపై వుంది .. ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతాను అని నాగబాబు తన మనసులోని మాటను వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments