నిత్యానందను ఆడిపోసుకున్నారు.. త్వరలోనే కైలాస కంట్రీకి వెళ్తా : మీరా మిథున్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:01 IST)
ఆధ్యాత్మిక ముసుగులో రాసలీలలు కొనసాగించి పోలీసులకు పట్టుబడి, బెయిలుపై విడుదలై పత్తాలేకుండా పారిపోయిన రాసలీలల స్వాములోరు నిత్యానందకు కోలీవుడ్ నటి మీరా మిథున్ అండగా నిలిచారు. అనవసరంగా నిత్యానందన్‌ను ఆడిపోసుకున్నారంటూ మండిపడింది. పైగా, తాను కూడా త్వరలోనే కైలాస దేశానికి వెళ్తానని ప్రకటించారు.
 
తమిళనాడు రాష్ట్రంలోని మదురైకు చెందిన నిత్యానంద.. తమిళ సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిలుపై వచ్చిన ఆయన తొలుత నేపాల్‌కు వెళ్లి.. అక్కడ నుంచి నకిలీ పాస్‌పోర్టు ద్వారా కరేబియన్ దీవులకు వెళ్లిపోయారు. కరేబియన్ దీవుల్లోని ఓ దీవిని సొంతంగా కొనుగోలు చేసి.. దానికి 'రిపబ్లిక్ ఆఫ్ కైలాస' అని నామకరణం చేశారు.
 
ప్రస్తుతం ఈ దేశంలోనే నిత్యానంద స్వామి తన శిష్యగణంతో సేదతీరుతున్నారు. ఈ క్రమంలో ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ కోసం ఓ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేశారు. దీనికి కైలాస రిజర్వు బ్యాంకు అని పేరు పెట్టి, ఈ కరెన్సీ చెలామణి అయ్యేందుకు పలు దేశాలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద స్వామీజీ నిత్యానందపై కోలీవుడ్ నటి మీరామిథున్ ప్రశంసలు కురిపించింది. అందరూ కలిసి ఆయనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. నిత్యానంద రోజురోజుకు మరింత శక్తిమంతంగా మారుతున్నారని పేర్కొంది. తాను త్వరలోనే నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపిన నటి.. ‘లాట్స్ ఆఫ్ లవ్’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments