నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

ఠాగూర్
మంగళవారం, 5 ఆగస్టు 2025 (13:22 IST)
బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి మీరా మిథున్ అరెస్టుకు తమిళనాడులోని చెన్నై కోర్టు ఆదేశాలు జారీచేసింది. గతంలో ఆమె దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారు. ఈ అభియోగాలపై ఆమెపై కేసు నమోదైంది. దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా(డీపీఐ)కు చెందిన నేతలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మీరా మిథున్‌తో పాటు ఆమె స్నేహితుడు అభిషేక్‌పై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
గత 2021 ఆగస్టు నెలలో వారిని అరెస్టు చేయగా, నెల రోజుల తర్వాత వారిద్దరూ మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మీరా మిథున్‌పై 2022లో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అరెస్ట్ వారెంట్ జారీ చేసి మూడేళ్లు గడిచిపోయింది. అయినా ఆమె పరారీలోనే ఉన్నారు. ఆమె ఆచూకీని పోలీసులు కూడా ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్న మీరా మిథున్‌ను రక్షించాలంటూ ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రాగా, పోలీసు తరపు న్యాయవాది ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను రక్షించి అక్కడున్న హోంకు తరలించారని తెలిపాు. ఢిల్లీ హోంలో ఉన్న మీరా మిథున్‌ను అరెస్టు చేసి ఈ నెల 11వ తేదీన హాజరుపరచాలని చెన్నై క్రైమ్ బ్రాంచ్ప పోలీసులను చెన్నై కోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments