Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరా జాస్మిన్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకురండి.. విశాల్

తమిళ చలనచిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్‌ సంఘ ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ ప్రస్తుతం పందెం కోడి సీక్వెల్‌కు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో విశాల్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (14:22 IST)
తమిళ చలనచిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్‌ సంఘ ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ ప్రస్తుతం పందెం కోడి సీక్వెల్‌కు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో విశాల్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో పందెం కోడి పార్ట్-1లో నటించిన మీరా జాస్మిన్.. స్క్రిప్ట్ ప్రకారం కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వుంది. అయితే మీరా జాస్మిన్‌కు వివాహం కావడంతో ఆమె దుబాయ్‌లో సెటిల్ అయిపోయింది. 
 
అలాగే ఇకపై సినిమాల్లో నటించేందుకు ఆసక్తి లేదని చెప్పుకొస్తుంది. కానీ విశాల్ మాత్రం మీరా జాస్మిన్ కోసం దుబాయ్‌కి తన అసిస్టెంట్‌ను పంపినట్లు తెలుస్తోంది. ఎలాగైనా మీరాజాస్మిన్‌కు నచ్చజెప్పి పందెంకోడి సీక్వెల్‌లో నటించేందుకు ఆమె కాల్షీట్స్ ఇచ్చేలా ఒప్పించాలని చెప్పి పంపాడట. 
 
అంతేకాకుండా ఆమె ఎక్కడ వున్నా వెతికి పట్టుకురావాలని ఆదేశించాడట. ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుంది. 2018 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి మీరా జాస్మిన్ విశాల్ పిలుపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments