Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై పరువు నష్టం కేసు.. హీరోయిన్లతో పార్టీ?

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (12:15 IST)
గత కొన్ని రోజులుగా తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తున్నారు. తన లియో సహనటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్సూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్స్ (NCW) జోక్యంతో తమిళనాడు పోలీసులు మన్సూర్‌పై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తర్వాత, సీనియర్ నటుడు త్రిషకు క్షమాపణలు చెప్పాడు. త్రిష కూడా క్షమించింది. 
 
అయితే తాజాగా త్రిష, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి ఖుష్బూపై పరువు నష్టం కేసులను దాఖలు చేయనున్నట్లు మన్సూర్ ప్రకటించారు. ఈ ముగ్గురు నటులపై 10 రోజుల పాటు పరువు నష్టం, ప్రజా శాంతికి భంగం కలిగించడం, సివిల్- క్రిమినల్, తనపై ముందస్తు ప్రణాళికతో అల్లర్లు వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేస్తానని మన్సూర్ చెప్పారు.
 
మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఏడాది హీరోయిన్లతో పార్టీ చేసుకుంటాడని.. అలాంటి వ్యక్తి తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మన్సూర్ మండిపడ్డాడు.
 
ప్రచారంలో ఉన్న వీడియో కల్పితమని, కేసు నమోదు చేసేటప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అసలు వీడియో, ఇతర సాక్ష్యాలను సమర్పిస్తానని మన్సూర్ పునరుద్ఘాటించారు. చిరు, ఖుష్బూ, దేశవ్యాప్తంగా అనేక మంది ఇతర సినీ ప్రముఖులు,  అభిమానులతో పాటు, మొత్తం ఎపిసోడ్‌లో మన్సూర్‌పై విరుచుకుపడి త్రిషకు తమ సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments