Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్సనల్ విజిట్.. అన్నావదితో లంచ్ చేయడానికి వచ్చా : మంచు విష్ణు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (18:23 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మంగళవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సీఎం జగన్‌తో భేటీ కేవలం వ్యక్తిగతమేనని చెప్పారు. అన్నావదినతో కలిసి లంచ్ చేయడానికి వచ్చానని ఈ సమావేశం తర్వాత మీడియాతో చెప్పారు. 
 
అదేసమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా, విష్ణు తన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ముఖ్యమంత్రిని కలవాలని భావించారన్నారు. ఆయనకు కూడా సీఎం నుంచి ఆహ్వానం అందిందని, కానీ, దాన్ని మా డాడీకి చేరకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వారు ఎవరో సమయం వచ్చినపుడు వెల్లడిస్తానని చెప్పారు.
 
ఇకపోతే, 'కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సినిమా పరిశ్రమ ఒక పెద్ద కుటుంబం. అంతర్గతంగా సమస్యలను పరిష్కరించుకుంటాం' అని ఆయన పేర్కొన్నారు.
 
సినీ పరిశ్రమ విశాఖపట్నం తరలింపుపై మా ప్రెసిడెంట్ స్పందిస్తూ.. ‘సినిమా వాళ్లకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు లాంటివి’ అంటూ ‘తెలుగువాళ్లంతా మాకు కావాలి’ అని వ్యాఖ్యానించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments