Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం మా బావ వైఎస్ఆర్ : మోహన్ బాబు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:43 IST)
ప్రజానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పలువురు సెలెబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు. అలాంటి వారిలో సినీ హీరో డాక్టర్ మోహన్ బాబు కూడా ఒకరు. ఆయన తన మనసులోని మాటను ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
వైఎస్సార్ స్నేహశీలి అంటూ కొనియాడారు. 'మాట తప్పలేరు మానధనులు' అన్న పోతన మాటకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం అంటూ అభివర్ణించారు.
 
"పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ మోహన్ బాబు స్పందించారు. 
 
అలాగే, ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన నివాళులు ట్విట్టర్ ద్వారా అర్పించారు. "విలక్షణ రాజకీయచతురుడు, అవసరంలో వున్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు పౌరుషానికి ప్రతినిధి , నిరుపేదల పాలిట ప్రత్యక్షదైవం, రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడం కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి డా రాజశేఖరరెడ్డిగారి జయంతి నేడు. వందనాలు మహానుభావా" అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments