Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (13:23 IST)
హీరో మంచు మనోజ్ శుక్రవారం చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తాను నటించిన చిత్రం "భైరవం" శుక్రవారం విడుదలైంది. దీన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా ఈ ఆసక్తికర ట్వీట్‌తో పాటు ఓ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన తండ్రి, హీరో మోహన్ బాబు నటించిన 'పెదరాయుడు' చిత్రంలో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటోను ఎడిట్ చేసి పంచుకున్నాడు. దీనికి ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అనే క్యాప్షన్ ఇచ్చారు. 
 
కాగా, తండ్రి మోహన్ బాబుతో వివాదాలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ పోస్టు చేయడం గమనార్హం. తన తండ్రి పాదాలను తాకాలని ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ భావోద్వేగానికి గురైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన "భైరవం" శుక్రవారం విడుదలైంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారనే టాక్ వస్తోంది. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూరమైన తర్వాత చేసిన మూవీ ఇది. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

కమల్ హాసన్‌కు షాకిచ్చిన కర్నాటక హైకోర్టు.. సారీ చెప్పడానికి అంత నామోషీనా?

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments