Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (13:23 IST)
హీరో మంచు మనోజ్ శుక్రవారం చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తాను నటించిన చిత్రం "భైరవం" శుక్రవారం విడుదలైంది. దీన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా ఈ ఆసక్తికర ట్వీట్‌తో పాటు ఓ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన తండ్రి, హీరో మోహన్ బాబు నటించిన 'పెదరాయుడు' చిత్రంలో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటోను ఎడిట్ చేసి పంచుకున్నాడు. దీనికి ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అనే క్యాప్షన్ ఇచ్చారు. 
 
కాగా, తండ్రి మోహన్ బాబుతో వివాదాలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ పోస్టు చేయడం గమనార్హం. తన తండ్రి పాదాలను తాకాలని ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ భావోద్వేగానికి గురైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన "భైరవం" శుక్రవారం విడుదలైంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారనే టాక్ వస్తోంది. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూరమైన తర్వాత చేసిన మూవీ ఇది. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments