Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లోడి అడుగుపెడుతున్న "మర్డర్" బోల్డ్ బ్యూటీ

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:30 IST)
'మర్డర్' చిత్రం బోల్డ్‌గా నటించి విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఈమె తొలిసారి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. పిరీడ్ డ్రామా కథాంశంతో తెరకెక్కే 'నాగమతి' చిత్రంలో మ‌ల్లికా కీలక పాత్ర పోషించ‌నుంద‌ని అంటున్నారు. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు.
 
నిజానికి మల్లికా షెరావత్‌కు 'మర్డర్' చిత్రం తర్వాత దశ తిరిగిపోయిందని చెప్పాలి. బాలీవుడ్‌లో బోల్డ్‌ నటిగా గుర్తింపు పొందడమే కాకుండా ఈ చిత్రంలో మ‌ల్లికా షెరావ‌త్ మ‌తులు పోగొట్టే అందాల‌తో క‌వ్వించింది. కెరీర్ ఆరంభంలోనే మ‌ల్లికా ఇంత‌గా అందాలు ఆర‌బోయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిని ఆమె లైట్‌గా తీసుకున్నారు. పైగా, విమర్శలపై కాకుండా తన సినీ కెరీర్‌పై దృష్టిసారించారు. ఇపుడు తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సమ్మతించారు. 
 
ముంబైలో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వ‌ర‌లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో న‌టించే న‌టీనటులు ఎవ‌రు, త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. కాగా, మల్లికా శెరావత్.. ప్రస్తుతం కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments