Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లోడి అడుగుపెడుతున్న "మర్డర్" బోల్డ్ బ్యూటీ

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:30 IST)
'మర్డర్' చిత్రం బోల్డ్‌గా నటించి విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఈమె తొలిసారి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. పిరీడ్ డ్రామా కథాంశంతో తెరకెక్కే 'నాగమతి' చిత్రంలో మ‌ల్లికా కీలక పాత్ర పోషించ‌నుంద‌ని అంటున్నారు. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు.
 
నిజానికి మల్లికా షెరావత్‌కు 'మర్డర్' చిత్రం తర్వాత దశ తిరిగిపోయిందని చెప్పాలి. బాలీవుడ్‌లో బోల్డ్‌ నటిగా గుర్తింపు పొందడమే కాకుండా ఈ చిత్రంలో మ‌ల్లికా షెరావ‌త్ మ‌తులు పోగొట్టే అందాల‌తో క‌వ్వించింది. కెరీర్ ఆరంభంలోనే మ‌ల్లికా ఇంత‌గా అందాలు ఆర‌బోయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిని ఆమె లైట్‌గా తీసుకున్నారు. పైగా, విమర్శలపై కాకుండా తన సినీ కెరీర్‌పై దృష్టిసారించారు. ఇపుడు తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సమ్మతించారు. 
 
ముంబైలో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వ‌ర‌లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో న‌టించే న‌టీనటులు ఎవ‌రు, త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. కాగా, మల్లికా శెరావత్.. ప్రస్తుతం కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments