Webdunia - Bharat's app for daily news and videos

Install App

''స్పైడర్'' మూవీ సెట్స్‌లో సితార, నమ్రత.. మగధీర టీమ్‌తో విదేశాల్లో గ్రాఫిక్స్ పనులు (ఫోటోలు)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ మూవీ సెట్స్‌లో ఆయన భార్య, నటీమణి నమ్రత శిరోద్కర్, ఆయన కుమార్తె సితార సందడి చేశారు. షూటింగ్ స్పాట్‌లో మహేష్ బాబు సితారతో గడిపిన సమయాన.. నమ్రత కొన్ని ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల

Mahesh Babu
Webdunia
మంగళవారం, 11 జులై 2017 (13:09 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ మూవీ సెట్స్‌లో ఆయన భార్య, నటీమణి నమ్రత శిరోద్కర్, ఆయన కుమార్తె సితార సందడి చేశారు. షూటింగ్ స్పాట్‌లో మహేష్ బాబు సితారతో గడిపిన సమయాన.. నమ్రత కొన్ని ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా 2000 నుంచి ప్రేమలో పడిన మహేష్ బాబు- నమ్రత.. 2005లో వివాహం చేసుకున్నారు. మహేష్- నమ్రత దంపతులకు గౌతమ్ కృష్ణ (11), సితార (5) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ షూటింగ్ స్పాట్‌లో నమ్రత, సితారలు ప్రిన్స్‌ను కలిసిన ఫోటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 
 
మరోవైపు స్పైడర్ సినిమాకి సంబంధించిన ఒక పాట మాత్రమే పెండింగ్ వుంది. వచ్చేనెల మొదటివారంలో ఆ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం గ్రాఫిక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్‌తో పాటు యూకేలో వీఎఫ్ఎక్స్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇక 'మగధీర' సినిమాకి పనిచేసిన ఇరాన్ టీమ్ వారు కూడా 'స్పైడర్' కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

హాలీవుడ్ గ్రాఫిక్స్ ప్రమాణాలకు ధీటుగా స్పైడర్ సినిమా పనులు జరుగుతున్నాయని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది.


























































 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments