మహేష్.. వెంకీ, చిరులతో ఓకే, మరి.. బాలయ్య, నాగ్‌లతో ఎప్పుడు?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (15:04 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు..  సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ బాబుతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేస్తుండటం విశేషం. మహేష్ మే నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అయితే... మహేష్ బాబు... నాగార్జునతో కలిసి సినిమా చేయాలనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే సినిమాని గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాలి అనుకున్నారు.
 
నాగార్జున, మహేష్ బాబు ఇద్దరికీ మణిరత్నం కథ చెప్పడం.. కథ విని నాగార్జున, మహేష్ ఓకే చెప్పడం జరిగిందని వార్తలు వచ్చాయి. అక్కినేని, ఘట్టమనేని ఫ్యామీలీ మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి వార్త బయకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా..? సినిమా ఎలా ఉంటుంది..? అని నాగార్జున, మహేష్ అభిమానులు ఈ సినిమాపై ఎంతో ఇంట్రస్ట్ చూపించారు. 
 
అయితే... ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా థ్రిల్లర్ కథాంశంతో మణిరత్నం సినిమా తీయాలనుకున్నారు. దీంతో ఈ కథ వర్కవుట్ కాదేమో అని నాగ్, మహేష్ వేరే కథతో సినిమా చేద్దామని మణిరత్నంకు చెప్పడం వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలిసింది.
 
ఇక చిరంజీవి సినిమాలో నటించేందుకు మహేష్ ఎందుకు ఓకే చెప్పాడంటే... కథ బాగా నచ్చడంతో పాటు మహేష్ కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో మహేష్ విన్న వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది. 
 
స్టూడెంట్ లీడర్ పాత్రలో మహేష్ కనిపిస్తారని.. మహేష్ చెప్పే డైలాగులు స్టూడెంట్స్‌ని ఆలోచింపచేసేలా ఉంటాయని తెలిసింది. ఏది ఏమైనా మహేష్ చిరంజీవి సినిమాలో నటించడంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత క్రేజ్ ఏర్పడింది. ఆగష్టు 22న ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. మహేష్.. బాలయ్య, నాగార్జునలతో కూడా భవిష్యత్‌లో సినిమాలు చేస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments