Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్న మహేష్ బాబు-జూనియర్ ఎన్టీఆర్

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (19:37 IST)
junior ntr
సూపర్ స్టార్లు ప్రస్తుతం బుల్లితెరపై మెరవడం ఫ్యాషనైపోయింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేశారు. నాని కూడా బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బుల్లితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. 
 
ఇంకో విశేషం ఏమిటంటే... సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌కు ప్రముఖ ఛానల్‌ భారీగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 
 
ఆట నాది.. కోటి మీది అంటూ బుల్లితెర ప్రేక్షకులకు తారక్‌ చేరువయ్యారు. ఆయన హోస్ట్‌గా  ఎవరు మీలో కోటీశ్వరులు షో సాగుతోంది. ఈ షో ప్రారంభ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ సందడి చేయగా.. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రాజమౌళి, కొరటాల శివ సైతం తమ ఆటతో మెప్పించనున్నారు. 
 
అలాగే దసరా కానుకగా ప్రసారం కాబోతున్న  "ఎవరు మీలో కోటీశ్వరులు" కార్యక్రమంలో మహేశ్‌బాబు స్పెషల్‌గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. దీంతో ఈ షో రేటింగ్ పెరిగే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments