Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయిదా పడిన మహర్షి 50 రోజుల వేడుక..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (14:25 IST)
మహేష్ బాబు, పూజా హెగ్డే , అల్లరి నరేష్ ప్రధాన తారాగణంతో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం మహర్షి వేసవి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.


ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్వినీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. యువకెరటం దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం నేటితో (జూన్ 27)తో 50 రోజులు పూర్తి చేసుకుంది. 
 
ఈ సినిమా ప్రస్తుతానికి 200 కేంద్రాల్లో విజయవంతంగా న‌డుస్తుండ‌డంతో చిత్ర యూనిట్ జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికగా 50 రోజుల వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భావించింది. కాగా ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల హఠాన్మరణంతో మహర్షి 50 రోజుల వేడుకను వాయిదా వేస్తున్నట్లు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. 
 
విజయ నిర్మల అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనుండగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మహర్షి 50 రోజుల వేడుక వాయిదా పడినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments