Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి తలసానితో ‘మా’ నూతన కార్యవర్గం భేటీ.!

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (22:08 IST)
నూతనంగా ఎన్నికైన ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్, జాయింట్ సెక్రెటరీ శివబాలాజీ, ఈసీ మెంబర్ సురేష్ కొండేటితో పాటు మరికొంత మంది సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన ‘మా’ కార్యవర్గానికి మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ నూతన అధ్యక్షుడు వీకే నరేష్.. మంత్రి తలసానితో దాదాపు ముప్పావు గంటపాటు చర్చించారు.
 
‘మా’లో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. ‘మా’ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయింపు విషయాన్ని కూడా మంత్రి దృష్టికి నరేష్ తీసుకొచ్చారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను ఖ‌చ్చితంగా పరిష్కరిస్తామని, సినీ రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు. స్థలం కేటాయింపు విషయాన్ని సీఎం కేసీఆర్‌తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments