Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా నటులపై ట్రోల్స్... డీజీపీ ఫిర్యాదు చేసిన 'మా'

సెల్వి
గురువారం, 18 జులై 2024 (17:33 IST)
సోషల్ మీడియా వేదికగా సినీ నటులను లక్ష్యంగా ట్రోల్స్, అసభ్య, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం డీజీపీని కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. సినీ నటులపై ట్రోల్స్ చేస్తున్నందుకుగాను, ఇప్పటికే ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయగా, మరో 250 యూట్యూబ్‌ ఛానళ్ల జాబితాను డీజీపీకి సమర్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా సభ్యులు కోరారు. 
 
ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ.. సైబర్‌ సెక్యూరిటీ విభాగం సహకారంతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి, ట్రోలర్స్‌పై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నటుడు రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. విమర్శలు, ట్రోల్స్‌ సరదాగా నవ్వుకునేలా ఉంటే బాగుంటుంది కానీ, వ్యక్తిగత విమర్శలు చేసి, కుటుంబ సభ్యులను కూడా ఏడిపించేలా ఉండరాదన్నారు. డబ్బు కోసం కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని అస్సలు ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments