సినిమా నటులపై ట్రోల్స్... డీజీపీ ఫిర్యాదు చేసిన 'మా'

సెల్వి
గురువారం, 18 జులై 2024 (17:33 IST)
సోషల్ మీడియా వేదికగా సినీ నటులను లక్ష్యంగా ట్రోల్స్, అసభ్య, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం డీజీపీని కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. సినీ నటులపై ట్రోల్స్ చేస్తున్నందుకుగాను, ఇప్పటికే ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయగా, మరో 250 యూట్యూబ్‌ ఛానళ్ల జాబితాను డీజీపీకి సమర్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా సభ్యులు కోరారు. 
 
ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ.. సైబర్‌ సెక్యూరిటీ విభాగం సహకారంతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి, ట్రోలర్స్‌పై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నటుడు రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. విమర్శలు, ట్రోల్స్‌ సరదాగా నవ్వుకునేలా ఉంటే బాగుంటుంది కానీ, వ్యక్తిగత విమర్శలు చేసి, కుటుంబ సభ్యులను కూడా ఏడిపించేలా ఉండరాదన్నారు. డబ్బు కోసం కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని అస్సలు ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments