Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ వద్దు.. టాలీవుడ్డే ముద్దంటున్న హీరోయిన్!

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:37 IST)
సాయిపల్లవి... టాలీవుడ్ హీరోయిన్. ఈమె తమిళనాడుకు చెందిన అమ్మాయి అయినప్పటికీ.. అచ్చతెనుగు అమ్మాయిలా ఉంటుంది. పైగా, తెలుగు చిత్రాలకు అతికినట్టుగా సరిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల తనకు వచ్చిన ఓ బాలీవుడ్ ప్రాజెక్టును ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "ఛత్రపతి" హిందీ రీమేక్ తెరకెక్కబోతుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. 
 
కానీ ఇప్పటివరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల "ఫిదా" బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments