Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయ్.. చిల్లీ గయ్స్... పూరీ కనెక్ట్స్ విల్ వి బౌన్స్ బ్యాక్ : చార్మీ

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (14:25 IST)
దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన "లైగర్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. పూరి జగన్నాథ్, చార్మీతో పాటు బాలీవుడు నిర్మాత కరణ్ జోహార్ సారథ్యంలోని ధర్మా ప్రొడక్షన్స్‌లు కలిసి భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించారు. గత నెల 25 తేదీ పాన్ ఇండియా మూవీగా విడుదలై చెత్త టాక్‌తో ఫ్లాప్ అయింది. ఈ చిత్ర నిర్మాణం కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాబట్టలేని పరిస్థితి నెలకొంది. 
 
ముఖ్యంగా లైగర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ చిత్రం ఓ రేంజ్‌లో ఉంటుందంటూ చిత్ర బృందం ప్రచారం చేసింది. కానీ, ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. ఈ క్రమంలో చార్మీ కౌర్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ళపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించింది. 
 
ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్ చేసింది. "హాయ్ చిల్లీ గయ్స్... కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరీ కనెక్ట్స్ మళ్లీ దృఢంగా, మెరుగ్గా తిరిగివస్తుంది. అప్పటివరకు బ్రతకండి. బ్రతకనివ్వండి" అంటూ హార్ట్ ఎమోజీని యాడ్ చేసి ట్వీట్ చేసింది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెజవాడలో భిక్షగాళ్లలా సిమి సంస్థతో సంబంధమున్న ఉగ్రవాదులు?

చకచక సాగిపోతున్న పాకిస్థాన్ జాతీయుల వీసాల రద్దు...

Altaf Lali: లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లాలి మృతి

AP Spouse Pension Scheme: విడో పెన్షన్లు.. ఏపీ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.. నెలకు రూ.4,000

ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరి రంగన్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments