నిన్న రాత్రి గెలిచాను.. ఇప్పుడు ఓడిపోయాను.. అనసూయ

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (10:28 IST)
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో యాంకర్ అనసూయ కూడా పోటీ చేశారు. ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున ఈసీ మెంబర్‌గా బరిలో దిగారు. తొలుత అనసూయ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుందని ఆదివారం జోరుగా ప్రచారం జరిగింది.
 
కానీ మరుసటి రోజు ఫలితాలు మారాయి. ‘మా’ ఎన్నికల అధికారి విడుదల చేసిన జాబితాలో అనసూయ పేరు లేదు. మంచు విష్ణు ప్యానెల్ కు చెందినవారు 10 మంది , ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారు 8 మంది ఉన్నారు. దీంతో అనసూయ షాక్ కి గురైంది.
 
నిన్న రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ సెటైరికల్ ట్వీట్‌ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ మరో ట్వీట్ వేసింది. అసలు, 600 పైచిలుకు ఓట్లు లెక్కించడానికి రెండ్రోజుల సమయం అవసరమా? అని సందేహం వ్యక్తం చేశారు అనసూయ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments