Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఔరా! రాజ‌ధాని మారింది ... ‘అమరావతి’ పాఠం తొలగింపు!

Advertiesment
ఔరా! రాజ‌ధాని మారింది ... ‘అమరావతి’ పాఠం తొలగింపు!
విజ‌య‌వాడ‌ , బుధవారం, 6 అక్టోబరు 2021 (10:07 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌, ఇక్క‌డ రాజ‌ధాని అనేది క‌ల‌గానే మిగిలిపోయింది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్మించాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు విశ్వప్ర‌య‌త్నం చేశారు. తాత్కాలిక రాజ‌ధానిని తేగ‌లిగారేకాని, దాన్ని శాశ్వ‌తం చేయ‌లేక‌పోయారు. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని కేవ‌లం శాస‌న రాజ‌ధానిగా పేర్కొని, విశాఖ‌, క‌ర్నూలు మ‌రో రెండు రాజ‌ధానుల‌ను సంక‌ల్పించారు. 
 
చంద్రబాబు హ‌యాంలో అమ‌రావ‌తి రాజ‌ధానిని పాఠ్యాంశంగా చేర్చ‌గా, ఇపుడు దానిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలగించింది. పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు.

తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి, 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేయడం కొస‌మెరుపు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ వంట గ్యాస్ బాదుడు... మళ్లీ కట్టెల పొయ్యిలు తప్పదా?