ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

ఠాగూర్
గురువారం, 4 డిశెంబరు 2025 (15:54 IST)
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏపీఎం అధినేత శరవణన్‌ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న తమిళ  చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. వీరిలో సీనియర్ నటుడు శివకుమార్, ఆయన కుమారుడు సూర్య కూడా ఉన్నారు. వీరిద్దరూ శరవణన్ భౌతికాయానికి నివాళులు అర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శరవణన్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, కంటతడి పెట్టుకున్నారు. 
 
అలాగే, తమిళనాడు సీఎం స్టాలిన్‌, రజనీకాంత్‌, సూర్య తండ్రి శివకుమార్‌ తదితరులు నిర్మాత మృతదేహానికి నివాళులర్పించారు. శరవణన్‌ (85) చెన్నైలోని నివాసంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళం, తెలుగు సహా పలు భాషల్లో 300కిపైగా సినిమాలు నిర్మించారాయన. సూర్య నటించిన ‘పేరళగన్‌’ (సుందరాంగుడు), ‘వీడొక్కడే’ తదితర చిత్రాలు ఏవీఎం ప్రొడక్షన్స్‌లోనే తెరకెక్కాయి.
 
శరవణన్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. శరవణన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తాను చిన్న వయసులో.. శరవణన్‌ను కలిశానని, ఏవీఎం స్టూడియోస్‌లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని విశాల్‌ గుర్తుచేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

Komatireddy: ఏపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారా?

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రక్షణ తయారీ కేంద్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments