చెన్నైలోని ఎన్టీఆర్ నివాసాన్ని అమ్మేస్తారా? గండిపేట కుటీరంపై లక్ష్మీపార్వతీ ఏమన్నారు?

లెజెండరీ నటుడు, తెలుగు తెరకి స్టార్ స్టేటస్ తెచ్చిన తొలితరం హీరో, అంతకుమించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ఇల్లు అమ్మకానికి సిద్ధమైందనే వార్తలు రావడంతో అభిమానులు నిరాశ చెంద

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (11:43 IST)
లెజెండరీ నటుడు, తెలుగు తెరకి స్టార్ స్టేటస్ తెచ్చిన తొలితరం హీరో, అంతకుమించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ఇల్లు అమ్మకానికి సిద్ధమైందనే వార్తలు రావడంతో అభిమానులు నిరాశ చెందారు. చెన్నైలోని టీ నగర్, బజుల్లా రోడ్డులోని హౌస్ నెంబర్ 28 ఎన్నో మధుర జ్ఞాపకాలకు వేదిక.

అప్పటి సినీతారలకు మద్రాసుకు విడదీయరాని అనుబంధం వుంది. అప్పట్లో చెన్నైలో నివాసం ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ నివాసం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న ‘ఇల్లు అమ్మబడును' బోర్డును చూసిన ఎన్టీఆర్ అభిమానులు మనస్తాపం చెందుతున్నారు. 
 
ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాదుకి వచ్చేయడంతో ప్రస్తుతం బజుల్లా రోడ్డులోని ఆ ఇల్లు ఆలనా పాలనా లేక కళావిహీనంగా మారింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఇంటి బయట ఇప్పుడు వేలాడుతున్న "ఇల్లు అమ్మబడును" అనే బోర్డు వుండటాన్ని చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని దాన్ని అమ్మే ప్రసక్తే లేదని.. లీజుకు కూడా ఇవ్వనని ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. తన భర్తకు సంబంధించి తనకు మిగిలిన ఆస్తి గండిపేటలోని కుటీరం మాత్రమేనని అన్నారు. ఆయన గుర్తుగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు. ఎవరైనా సరే గండిపేటకు వచ్చి ఎన్టీఆర్ కుటీరాన్ని చూడవచ్చని లక్ష్మీపార్వతి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments