హీరో రాజ్ తరుణ్ బంగారం దొంగిలించారు : లావణ్య ఫిర్యాదు!

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (16:26 IST)
హీరో రాజ్ తరుణ్‌పై ఆయన మాజీ ప్రియురాలు లావణ్య చోరీ కేసు పెట్టింది. రాజ్ కిరణ్ బంగారాన్ని చోరీ చేశాడంటూ ఆరోపించింది. తన బంగారం, మంగళసూత్రం, దొంగిలించినట్టు ఆమె హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాను కొనుగోలు చేసిన జ్యూవెలరీ షాప్ బిల్లులను కూడా సాక్ష్యాధారాలుగా చూపించారు. 
 
తన బంగారు నగలను బీరువాలో దాచానని, వాటి తాళం చెవిలు రాజ్ తరుణ్ వద్ద ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండానే బీరావాలోని బంగారం దొంగిలించాడని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సమర్పిస్తున్నట్టు తెలిపింది. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన బంగారం విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని పేర్కొంది. 
 
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య గతంలోనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇపుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఉంటున్నాడంటూ ఆమె గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తయారు చేసిన చార్జిషీటులో రాజ్ తరుణ్ తప్పు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ కేసులో రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందిన విషయం తెల్సిందే. ఈ కేసు కొనసాగుతుండగా మరోవైపు, చోరీ కేసు పెట్టడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments