Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఎన్ని థియేట‌ర్లో రిలీజ్ అవుతుందో తెలుసా?

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (19:38 IST)
రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ.. 800 థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్‌కు, సాంగ్స్‌కు, విశేషమైన ఆదరణ లభించిందని తెలిపింది. 
 
అలాగే పప్పు లాంటి అబ్బాయి పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో ట్రెండింగ్ అయ్యిందని చిత్ర బృందం వెల్లడించింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదని... ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపధ్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్ప్రష్టం చేసింది. ఇందులోని  ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్‌గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments