Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను భరించేందుకు సిద్ధమైన కృష్ణవంశీ.. ఎలాగో తెలుసా?

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (11:44 IST)
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, సినీ నటి రమ్యకృష్ణ భార్యాభర్తలన్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చంద్రలేఖ', 'శ్రీ ఆంజనేయం' చిత్రాల్లో రమ్యకృష్ణ కనిపించింది. అలాగే ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసి కృష్ణవంశీ కొత్త సినిమాను రూపొందించనున్నారు. 
 
ఈ సినిమా రంగమార్తాండ పేరుతో తెరకెక్కబోతోంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను సొంతం చేసుకున్న కృష్ణవంశీకి ప్రస్తుతం హిట్ సినిమాలు లేవు. 
 
దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలని భావించిన కృష్ణవంశీ ఓ మరాఠీ రీమేక్‌తో రాబోతున్నాడు. మరాఠిలో మంచి విజయం సాధించిన 'నటసామ్రాట్' రీమేక్‌కు కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో తన భార్య రమ్యకృష్ణను నటింపజేసి హిట్ కొట్టేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందుకు రమ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments