Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోలనే నమ్ముకున్న టాలీవుడ్ దర్శకుడు?!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:43 IST)
తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతిభను చాటిన దర్శకులలో జాగర్లమూడి క్రిష్ ఒకరు. ఇతని చిత్రాలు వైవిధ్యంగా, సందేశాత్మకంగా కొనసాగుతాయి. కానీ ఇప్పుడు అతని ప్రతిభకు తగినట్లుగా హిట్స్ రాకపోవడం నిరాశపరుస్తోంది. నిర్మాతగానే కాకుండా దర్శకునిగా కూడా విఫలమవుతున్నాడు. అతను నిర్మించిన అంతరిక్షం సినిమా తగిన ఫలితాలను రాబట్టలేదు. దర్శకునిగా వ్యవహరించి తీసిన "ఎన్టీఆర్ బయోపిక్" భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ హిట్ కొట్టలేకపోయింది. 
 
ఈ సినిమా వలన అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. దీంతో క్రిష్ తదుపరి ఎలాంటి సినిమా తీయబోతున్నారని అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా విభిన్న కథనాలతో ప్రేక్షకుల మనస్సును ఆకట్టుకునే క్రిష్... బాలయ్య కోరిక మేరకు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' రెండు భాగాలుగా తీసి విఫలమయ్యాడు. దానికితోడు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. 
 
క్రిష్ దర్శత్వం వహించిన "మణికర్ణిక" చిత్రం విషయంలో కూడా కంగన రనౌత్‌తో విభేదాలు వచ్చాయి. క్రిష్ ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన రచయితల బృందంతో కలసి అద్భుతమైన కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంతో తాను దర్శకుడిగా పుంజుకోవాలని క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం. 
 
క్రిష్ ఎక్కువగా మెగా హీరోలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ లేదా అల్లుఅర్జున్‌లలో ఎవరో ఒకరితో ఈ చిత్రం చేయాలని క్రిష్ భావిస్తున్నాడట. ఇద్దరూ ఇప్పుడు బిజీగా ఉన్నారు. క్రిష్‌కు రామ్‌చరణ్ ఓకే చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. "ఆర్ఆర్ఆర్" షూటింగ్ పూర్తయ్యేది 2020లో. ఇక అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ చిత్రంలో బిజీ కాబోతున్నాడు. క్రిష్ ఎన్నాళ్లు వేచి ఉంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments