Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 13న 'కొత్త బంగారులోకం'లోకి అడుగుపెడుతున్న శ్వేతాబసు

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (14:16 IST)
కొత్త బంగారు లోకం అనగానే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు శ్వేతాబసు ప్రసాద్. బెంగాలీ ముద్దుగుమ్మ అయిన శ్వేతాబసు కొత్త బంగారులోకం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిలవ్వాలని నిర్ణయించుకుంది. ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను ఈ నెల డిసెంబరు 13న పుణెలో వివాహమాడనుంది. రోహిత్‌కు తనే పెళ్లి ప్రపోజ్ చేసినట్లు ఆమె అంగీకరించింది. తన ప్రపోజల్ పైన రోహిత్ సంతోషం వ్యక్తం చేసి మూడుముళ్లు వేయడానికి సిద్ధమయ్యాడు. 
 
ఇకపోతే శ్వేతాబసు కెరీర్లో కొత్త బంగారులోకం మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం కాగా ఆ తర్వాత ఆమె ‘రైడ్’, ‘కళావర్ కింగ్’, ‘కాస్కో’ తదితర చిత్రాల్లో నటించింది. ఐతే అనూహ్యంగా ఆమె వ్యభిచార ఆరోపణల్లో చిక్కుకుని అరెస్టయ్యింది. దానితో ఆమె సినీ కెరీర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఐనా ధైర్యంతో తన ఫిజిక్ చక్కగా మెయింటైన్ చేసి పలు చిత్రాలు, సీరియళ్లలో నటించింది కానీ అనుకున్న మైలేజి రాలేదు. దానితో ఇక పెళ్లే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసింది. ఏదేమైనా పెళ్లితో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్న శ్వేతకు విషెస్ చెప్పేద్దాం.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments