Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌కు భారతీరాజా షాకింగ్ ట్రీట్ ... తమిళనాడును తమిళుడే పాలించాలి!

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కోలీవుడ్ అగ్ర దర్శకుడు భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రజనీకాంత్ స్థానికతపై కొన్ని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు రాద్దాంతం చేస్తున్న నేపథ్యంలో ఈ అగ్రదర్శకుడు ర

Webdunia
బుధవారం, 24 మే 2017 (12:03 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కోలీవుడ్ అగ్ర దర్శకుడు భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రజనీకాంత్ స్థానికతపై కొన్ని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు రాద్దాంతం చేస్తున్న నేపథ్యంలో ఈ అగ్రదర్శకుడు రజనీ స్థానికతను ప్రశ్నించేలా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. 
 
వాస్తవానికి తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంచానికే పరితమైన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత అనేది నెలకొంది. వీరిద్దరి స్థానాలను భర్తీ చేసే నేతలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఇదేసమయంలో రజనీకాంత్ ఇటీవల తన అభిమానులతో సమావేశమయ్యారు. సొంతగా రాజకీయ పార్టీని స్థాపించే నిమిత్తమే ఆయన అభిమానులతో సమావేశమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. 
 
దీంతో రజనీని రాజకీయాల్లో రాకుండా అడ్డుకునేందుకు ఆయన తమిళుడు కాదంటూ పలు తమిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రముఖ తమిళ సినీ దర్శకుడు భారతీరాజా స్పందించారు. 
 
ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు తమిళనాడులో జీవించడంలో తప్పు లేదని... కానీ, రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మాత్రం వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. తమిళనాడులో పుట్టిన వారికే తమిళులను పాలించే హక్కు ఉందని స్పష్టంచేశారు. తమిళ భాషను కాపాడాలని తమిళులంతా ఐకమత్యంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వయోభారం కారణంగా తాను రాజకీయపరంగా ఏమీ చేయలేక పోయినా తమిళ యువకులు మాత్రం అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. తమిళ సినీ రంగంలో ఎంతో సీనియర్ అయిన భారతీరాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments