Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్బందులు పెడుతున్నారంటూ కన్నీరు పెట్టుకున్న హీరో శింబు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:17 IST)
హీరోయిన్ నయనతార మాజీ ప్రియుడు, తమిళ హీరో శింబు వేదికపై కన్నీరు పెట్టుకున్నారు. కొందరు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ తీవ్ర భావోద్వేగానికిలోనై కళ్లు చెమర్చారు. ఈ ఘటన గురువారం తాను నటించిన మనాడు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా తమతమ ప్రసంగాలను పూర్తి చేశారు. ఆ తర్వాత చివరంగా హీరో శింబు మాట్లాడారు. ప్రారంభంలో సరదాగానే మాట్లాడిన శింబు తన ప్రసంగం ముగింపు సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 
 
"తనను కొందరు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారనీ, వారి సంగతి నేను చూసుకుంటాను.. నన్ను మాత్రం మీరు (ఫ్యాన్స్) చూసుకోవాలంటూ" ఈ వేడుకకు హాజరైన అభిమానలకు విజ్ఞప్తి చేశారు.
 
దీంతో అప్పటివరకు ఎంతో సరదాగా సాగిన కార్యక్రమం ఒక్కసారిగా నిశ్శబద్ధంగా ఆవహించింది. ఆ తర్వాత వేదికపై ఉన్న నిర్మాతలు కె.రాజన్, సురేష్ కామాక్షి, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, యువ నటుడు మహత్ రాఘవేంద్ర వంటివారు శింబును ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments