Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌ను కలిసిన ఒడిశా తెలుగు ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (18:50 IST)
ఒడిశాలోని పర్లాఖిముడి ఎమ్మెల్యే గజపతి జిల్లా బీజేపీ చీఫ్ కోడూరు రాయణరావు ఇవాళ హైదరాబాదులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒడిశాలోని తెలుగువారి సమస్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది.
 
ఒడిశాలోని గజపతి జిల్లాలో తెలుగువాళ్లు ఎక్కువమంది ఉన్నారని, సరిహద్దు ప్రాంతాల్లో వారికి పలు సమస్యలు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు తెలిపారు. సమస్యల పరిష్కారానికి జనసేన కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అనంతరం నారాయణరావు మాట్లాడుతూ తనకు చిరంజీవి, పవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
 
తెలుగు వారి ప్రాబల్యం గరించి వపన్ కల్యాణ్ కు వివరించానని, తమ విజ్ఞప్తి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సరిహద్దు రెండు వైపుల ఉన్న ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అయితే పాలనాపరమైన నిబంధనల వల్ల సమస్యలు వస్తున్న తీరును పవన్‌కు వివరించానని తెలిపారు. కాగా ఈ భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు నారాయణరావు పూరీ జగన్నాథుడి చిత్ర పటాన్ని బహుకరించారు.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments