Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా సినిమా ప్రారంభం

Webdunia
గురువారం, 15 జులై 2021 (15:45 IST)
Divya-kiran
లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు ముహూర్తం పెట్టారు. ఈమె ప్రొడక్షన్లో మొదటి సినిమా కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కబోతుంది. జూలై 15న కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కోడి దివ్య. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న 5వ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.
 
ఈ సినిమాకు `సమ్మతమే’ అనే పేరుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. `రాజావారు రాణిగారు’చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ తాజాగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ‘సెబాస్టియన్’ సినిమా కూడా ఆయ‌న చేయ బోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments