Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి కన్నడ దర్శకుడు ప్రదీప్ రాజ్ మృతి

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:12 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకడం వల్ల దర్శకుడు ప్రదీప్ రాజ్ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన ఆయన్ను బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, గురువారం చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
అయితే, గత 15 సంవత్సరాలుగా ఆయన చక్కెర వ్యాధితో బాధపడుతూ వచ్చారు. దీనికితోడు కరోనా వైరస్ సోకడంతో అనారోగ్యం బాగా క్షీణించింది. ఫలితంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు వెల్లడించారు. ఇదిలావుంటే, ఆయన వయసు 46 యేళ్లు కాగా, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు పుదుచ్చేరిలో జరుగనున్నాయి. 
 
ఈయన కేజీఎఫ్ హీరో యష్‌తో కలిసి కిచ్చా, కిరాతక వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలు యష్‌కు స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టాయి. అలాగే, గోల్డెన్ స్టార్ మిస్టర్, రజనీకాంత, సతీష్ నివాసం వంటి అనేక చిత్రాలు ఆయన తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

PM Modi: ఉగ్రవాదాన్ని దెబ్బతీయడం మన జాతీయ సంకల్పం- మోదీ

అత్యాచారం చేసిన బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. అయినా జైలులోనే...

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments