Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమా కియారా అద్వానీ దశ మార్చింది... క్యూ కడుతున్న నిర్మాతలు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (11:34 IST)
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి "కబీర్ సింగ్" పేరుతో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో ఈమె నటనకు బాలీవుడ్ సినీ జనం ఫిదా అయిపోయింది. 
 
ఈ ఒక్క సినిమాతో కియారా అద్వానీ దశ తిరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె కమిట్ అయిన పలు చిత్రాలతో రవ్వంత సమయం లేకపోయినప్పటికీ నిర్మాతలు మాత్రం ఆమె సమయం కోసం వేసి చూస్తున్నారు. 
 
పైగా, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా స్టార్‌ హీరోయిన్లుగా పేరు పడిన వారందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడడంతో కియారాకు భలే గిరాకీ రావడానికి కూడా మరో కారణం. ఇదే అదునుగా భావించిన కియారా తన పారితోషికాన్ని డబుల్‌ చేసినా కిమ్మనకుండా ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. 
 
బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు. మరి ఇంత డిమాండ్‌ ఉన్న కియారా ఇప్పట్లో తెలుగులో నటించే ఛాన్సే లేదనీ, అసలు తెలుగుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్‌లో జనాలు అంటున్నారు. 
 
కాగా, తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంలో కియారా నటించింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినప్పటికీ అది ఆమెను నిరాశపరిచింది. అయినప్పటికీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లలో ఆమె డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments